Banner
Watermark
ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
📅 17 November 2025 ✍️ REPUBLIC HINDUSTAN
News Image
- డిమాపూర్‌లో యువతకు కృత్రిమ మేధస్సు ఆధారిత నైపుణ్య శిక్షణ
- కిఫిరే క్రెడిట్ అవుట్రీచ్‌లో స్థానిక హస్తకళలను పరిశీలించిన మంత్రి
- దూర గ్రామాలకు సేవలందిస్తున్న మల్టీ-యుటిలిటీ అంబులెన్స్ బైక్‌లను సమీక్ష

డిమాపూర్, 17 నవంబర్ :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాగాలాండ్‌లోని డిమాపూర్‌లో SIDBI మద్దతుతో ఏర్పాటు చేసిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు. యువతను ఆధునిక సాంకేతికతతో సజ్జం చేయడం, కృత్రిమ మేధస్సు ఆధారిత వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా పరిశ్రమలతో అనేక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. తరువాత కిఫిరేలో జరిగిన క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్‌నెట్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించి నాగాలాండ్ ప్రత్యేకతలను ప్రతిబింబించే హస్తకళలు, వస్త్రాలు, ఆభరణాలు, బనానా ఫైబర్ ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను పరిశీలించారు. MEPP పథకం ద్వారా స్థానిక పారిశ్రామికవేత్తలకు మార్కెట్ అవకాశాలు, ఆర్థిక సాక్షరత, సామర్థ్యవృద్ధి కార్యక్రమాలు అందించడంలో చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. కిఫిరే జిల్లా ఆసుపత్రిలో సిఎస్‌ఆర్ మద్దతుతో అందుబాటులోకి వచ్చిన మల్టీ-యుటిలిటీ అంబులెన్స్ బైక్‌లను కూడా మంత్రి సమీక్షించారు. అత్యవసర చికిత్స, మందుల పంపిణీ, దూర ప్రాంతాల్లో రోగులను తరలించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం 107 గ్రామాలు ఈ సేవలతో లాభం పొందుతున్నాయి. యువతకు నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఆరోగ్య సదుపాయాల బలోపేతం, చిన్న పారిశ్రామికవేత్తల సాధికారత కోసం చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
🏠 Home